5 సం|| క్రితం నాకు నేను రాసుకున్న వ్యాసం..ఇక్కడ ప్రచురిస్తున్నాను..
చైతన్యం..నా చిన్నప్పటినుండి ప్రతీ సినిమాలోనూ, టీ.వీ లలోనూ వింటున్న పదం.దానికర్థం నాకప్పుడు తెలీదు. ఇప్పుడు కూడ తెలీటంలేదు. తెలియటానికి ఎప్పుడైనా దానిగురించి ఆలోచిస్తే కదా!అయినా, ఆలోచించినంత మాత్రాన తెలిసిపోతుందా ఏమిటి? చిన్నతనంలో ప్రజల్లో "చైతన్యం" రావాలి అన్న పదం తప్ప ఎవరూ నాకు చైతన్యానికి అర్థం చెప్పలేదు.
ఎన్నిసార్లు ఎన్నుకున్నా, చెప్పిన వాగ్ధానాన్ని మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో చెప్పి, అవి నెరవేర్చకుండా మళ్ళీ మొహం తుడుచుకొని 5 యేళ్ళ తరువాత కనిపించినా రూపాయి కాసులకి, సారా పాకెట్లకి జనం అమ్ముడుపోయి ఓట్లు వేసినప్పుడు మొదటిసారి "చైతన్యం" అంటే ఏమిటో తెలిసింది. అయినా నేను అనుకున్న చైతన్యం నాకు వచ్చి, నేను ఒక్కడిని ఆ మనిషికి ఓటు వెయ్యకపోయినా, మిగతా జనం ఓట్లు వేసి గెలిపించినప్పుడు ..వాళ్ళకి చైతన్యం లేదు అనుకున్నాను. ఈ చైతన్యం గురించి నాలాగ బాధపడేవాళ్ళు అన్నిరంగాలలోనూ ఉన్నారు. సినిమా రంగంలోని ఒక డైరెక్టరు..చైతన్యం ఎక్కువై ఒక సినిమా తీస్తే.. వందరోజులు ఆడింది. నూటఒకటో రోజునుండి మర్చిపోయారు. ఏ చైతన్యం గురించి ఆ దర్శకుడు ప్రయత్నించాడో..దానికి.. నూటఒకటో రోజు తెరపడింది. చాలా రోజుల తరువాత మరొక దర్శకుడు ప్రయత్నిస్తే పట్టుమని పది రోజులు కూదా ఆడలేదు. మరి చైతన్యం ఎలా వస్తుంది ఈ ప్రజల్లో?
ఇదివరకు "రాజకీయ" నాయకులు, 'అమ్మో ప్రజలకి తెలిస్తే ఓట్లేయరేమో' అని భయపడేవారు. ఇప్పుడు వాళ్ళకి కూడా తెలిసిపోయినట్లుంది..ప్రజలకి చైతన్యం లేదని. దాంతో వాళ్ళు రెచ్చిపోయి, ఒక్కొక్కరికి ఒక రాజ్యం (కొంత భూభాగం) ఇచ్చేస్తే,. దానికి వాళ్ళు రాజులై పరిపాలించుకొని, దానిని దోచుకుందామని అనుకుంటున్నారు.బహిరంగంగా "నీకెంత" అంటే "నీకెంత?" అనుకొనేవరకు వచ్చింది. అయినా ప్రజల్లో చైతన్యం రాలేదు.
ఇప్పుడు పరిస్థితులు మారాయి, ప్రతీ ఇంటిలోనూ ఒక టీ.వీ, ఒక్క మన రాష్ట్రం లోనే 4 ప్రముఖ వార్తా ఛానెళ్ళు, 5 ప్రముఖ వినోద ఛానెళ్ళున్నాయి, మీడియా బలపడింది అని మీరు అనుకోవచ్చు.. కాని వీళ్ళలో కూడా చైతన్యం కరువయ్యింది. ఎన్ని చానెళ్ళు ప్రజాభిప్రాయాల్ని, నిపుణుల/విద్యావంతుల సలహాలను, సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు? కొన్ని చానెళ్ళు కొంచెం ధైర్యం చేసి రహస్య కెమేరాలతో కొంతమంది "ప్రముఖుల" జాబుతాలను బయటికి తెచ్చినా.. కొద్దిరోజుల్లోనే వాళ్ళు తల ఎత్తుకొని తిరిగే రోజులొచ్చాయి.అయినా ప్రేక్షకులు లేని కార్యక్రమాలను టీ.వీలు మాత్రం ఎలా ప్రసారం చేస్తాయి చెప్పండి.. ఇలాంటి మంచి కార్యక్రమాలు, చర్చలు రాగానే, కుర్రకారు ఛానెల్ మార్చేస్తోంది. అవును.. ఎందుకు ఈ చర్చలు..ఎవరి దృష్టి ఆకర్షిద్దామని? కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ప్రజల్లో "చైతన్యం" రాలేదు. చైతన్యం లేని యువత రాజకీయల్ని వారసత్వానికి పరిమితం చేస్తుంది. చైతన్యం ఉన్నా..విద్యావంతుల మేధస్సు కేవలం టీ.వీ.ల్లో చర్చలకే పరిమితం ఔతుంది. "నేను ఒక్కడినే సమాజాన్ని మార్చలేను" అనే అశక్తత పెరిగి చైతన్యాన్ని అడ్డుకుంటుంది.
చైతన్యం అంటే నాకు తెలిసింది. చైతన్యం అంటే బాధ్యత. ఎవరి బాధ్యత వాళ్ళు నెరవేర్చినప్పుడు చైతన్యం వచ్చినట్లే. "సమాజాన్ని మార్చడానికి ఉద్యమించిన వారిలో నేనూ ఒకడిని" అని అనుకుంటే చైతన్యం వచ్చినట్లే. "నాకెందుకులే" అనుకున్న దానినుండి "నేను సైతం" అనుకుంటే చైతన్యం వచ్చినట్లే. ఈ చైతన్యం "ఒక" పౌరుణ్ణి నిద్ర లేపాలి. హక్కుల్ని అడిగేముందు విధుల్ని నిర్వర్తించేలా చేయాలి.ఈ చైతన్యం, యువతను ఆలోచింపచేయాలి.ఈ చైతన్యం, ఒక సారాయి పేకెట్టుకి దేశభవిష్యత్తును అమ్మకుండా ఆపగలగాలి. ఎవరికి అన్యాయం జరిగినా బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలను ధ్వంసం చేసి, మన సొమ్ము మనమే నాశనం చేసుకుంటున్నామని తెలుసుకునేలా చేయాలి. రాయితీలను కులాలను బట్టి కాక పేదవారికి చేర్చగలగాలి.
WHERE the mind is without fear and the head is held high
Where knowledge is free
Where the world has not been broken up into fragments
by narrow domestic walls
Where words come out from the depth of truth
Where tireless striving stretches its arms towards perfection
Where the clear stream of reason has not lost its way
Into the dreary desert sand of dead habit
Where the mind is led forward by thee
Into ever-widening thought and action
Into that heaven of freedom, my Father, let my country awake.
--Rabindranath Tagore
దీనికి అర్థం చెప్పక్కరలేదు..రవీంద్రుడు అర్థమయ్యేటట్లే చెప్పాడు. మనం ఎప్పుడు అర్థం చేసుకుంటామో..
To be continued...
This blog is about andhra pradesh politics. people requested to post their views(through comments) about present trend of politics. ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగ ఉండాల్సిన పత్రికలు ఎదో ఒక పార్టీ కి మద్దతు ఇస్తూ రాస్తే ఇక ప్రజల బాధలు పట్టించుకొనేది ఎవరు? ఈ కుల్లు రాజకీయల కంపు నేను భరించలేక..ఎవరితొ చెప్పాలో తెలియక..నా బాధని ఇక్కడ పంచుకుంటున్నాను.
Saturday, March 19, 2011
Thursday, March 10, 2011
దీనికి ఏ శీర్షిక పెట్టాలో తెలీక!!
మీ పిండాకూడు పిల్లులు తిన..మీకు శ్రార్ధం పెట్ట..ఇంకా ఆన్ని బూతులు కలిపి... మీ రాజకీయలను తగలబెట్ట..అన్నమయ్య, పింగళి, వీరేశలింగం ఆ మహానాయకుల విగ్రహాల జోలికి వెళ్ళారేంట్రా...వెళ్ళటానికి మేకు అర్హత ఎక్కడ ఉంది? ఎర్రాప్రగడ, శ్రీ శ్రీ, జాషువా లు మీకు ఏమి అన్యాయం చేశారు రా?
వీరు, మీకు కావాల్సిన పదవులు ఇవ్వలేదా? తెలంగాణ ఇవ్వనన్నారా వీళ్ళు? అభాగ్యుల మీద అత్యాచారం చేసిన "దొరలా", "రజాకార్లా", భారతీయుల ఆత్మ గౌరవాన్ని సవాల్ చేసిన "తెల్లవాళ్ళా?". వీళ్ళకి.. "నేటి తెలంగాణ సమస్య"కి సంబంధం ఏంటిరా?
జాతి కోసం పుట్టి, పోరాడిన వారు కొందరైతే, భాష సంస్కారం కోసం, మానసిక చైతన్యం కోసం కొందరు, బడుగు బలహీన వర్గాల గొంతైంది మరికొందరు. జాతి గౌరవాన్ని ఇనుమడింప చేయడానికి పుట్టిన మహా మనుషులను గుర్తుంచుకొని వారి అడుగు జాడలలో నడవాల్సింది పోయి.. ఈరోజు జరిగిన విగ్రహ ధ్వంసా కార్యక్రమం నీచమైనదనాలా..దారుణమైనదనాలా..లేక చివరికి.. అందరిలాగానే ప్రభుత్వ వైఫల్యమనాలా? ఛా! అసహ్యం వేస్తుందిరా! మిమ్మల్ని ఏమీ చెయ్యలేనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది.ప్రస్తుతానికి నాకు కేవలం ఓటు హక్కు మాత్రమే ఉంది. కొన్నాళ్ళకి అడిగిన వాడికి ఓటు వెయ్యకపోతే కొడతారేమో..ఇదీ ప్రజాస్వామ్యం.
అసలే విగ్రహాలు పగలకొట్టారు అని బాధపడుతుంటే, ఒక వార్తా ఛానెల్ "ఇది సమంజసమా అని ఓటింగ్ పెట్టింది". విచిత్రంగా, మంచోళ్ళు కన్నా పిచ్చొళ్ళే ఎక్కువగ ఉన్నారు అని వోతింగ్ లో తేలింది. ప్రజలారా, మన జాతి నాశనం సమంజసమా?
వీరు, మీకు కావాల్సిన పదవులు ఇవ్వలేదా? తెలంగాణ ఇవ్వనన్నారా వీళ్ళు? అభాగ్యుల మీద అత్యాచారం చేసిన "దొరలా", "రజాకార్లా", భారతీయుల ఆత్మ గౌరవాన్ని సవాల్ చేసిన "తెల్లవాళ్ళా?". వీళ్ళకి.. "నేటి తెలంగాణ సమస్య"కి సంబంధం ఏంటిరా?
జాతి కోసం పుట్టి, పోరాడిన వారు కొందరైతే, భాష సంస్కారం కోసం, మానసిక చైతన్యం కోసం కొందరు, బడుగు బలహీన వర్గాల గొంతైంది మరికొందరు. జాతి గౌరవాన్ని ఇనుమడింప చేయడానికి పుట్టిన మహా మనుషులను గుర్తుంచుకొని వారి అడుగు జాడలలో నడవాల్సింది పోయి.. ఈరోజు జరిగిన విగ్రహ ధ్వంసా కార్యక్రమం నీచమైనదనాలా..దారుణమైనదనాలా..లేక చివరికి.. అందరిలాగానే ప్రభుత్వ వైఫల్యమనాలా? ఛా! అసహ్యం వేస్తుందిరా! మిమ్మల్ని ఏమీ చెయ్యలేనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది.ప్రస్తుతానికి నాకు కేవలం ఓటు హక్కు మాత్రమే ఉంది. కొన్నాళ్ళకి అడిగిన వాడికి ఓటు వెయ్యకపోతే కొడతారేమో..ఇదీ ప్రజాస్వామ్యం.
అసలే విగ్రహాలు పగలకొట్టారు అని బాధపడుతుంటే, ఒక వార్తా ఛానెల్ "ఇది సమంజసమా అని ఓటింగ్ పెట్టింది". విచిత్రంగా, మంచోళ్ళు కన్నా పిచ్చొళ్ళే ఎక్కువగ ఉన్నారు అని వోతింగ్ లో తేలింది. ప్రజలారా, మన జాతి నాశనం సమంజసమా?
Thursday, January 6, 2011
తెలుగోడు
ఓ తెలుగోడా, పంటలు పండక ఏడ్చావు, పండినది అందక ఏడ్చావు.. కాయగూరలు కొనలేక ఎడ్చావు, ఇంటి అద్దె కట్టలేక ఏడ్చవు, ఉల్లి ధర పెరిగిందని ఏడ్చావు, ధాన్యం అమ్మలేక ఏడ్చావు, బియ్యం కొనలేక ఏడ్చావు, ఈ రాజకీయ నాయకుల ఆటలో పావుగా మారావు. కన్ను తెరచి భవిష్యత్తు చూడు. రాష్ట్రం ముక్కలైతే మిగిలేది పన్నులే. రాజకీయ నాయకులకి కొత్త పదవులే.అయినా ఈ ప్రజాస్వామ్య దేశం లొ నిన్నెవరు అడుగుతారు లే..దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొంటారు..
ఓ విద్యార్థీ, ఏది నీ ఛదువు? దొంగలకు గొడుగు పడుతున్నావా? తెలిసే పడుతున్నావా? ఈ ఉచ్చులొ నీ జాతి మొత్తాన్ని ఉరి తీస్తున్నవా? కళ్ళు తెరచి చూడు.. అభివ్రుద్ధి కాంక్షించు..
ఓ విద్యార్థీ, ఏది నీ ఛదువు? దొంగలకు గొడుగు పడుతున్నావా? తెలిసే పడుతున్నావా? ఈ ఉచ్చులొ నీ జాతి మొత్తాన్ని ఉరి తీస్తున్నవా? కళ్ళు తెరచి చూడు.. అభివ్రుద్ధి కాంక్షించు..
Subscribe to:
Posts (Atom)