మీ పిండాకూడు పిల్లులు తిన..మీకు శ్రార్ధం పెట్ట..ఇంకా ఆన్ని బూతులు కలిపి... మీ రాజకీయలను తగలబెట్ట..అన్నమయ్య, పింగళి, వీరేశలింగం ఆ మహానాయకుల విగ్రహాల జోలికి వెళ్ళారేంట్రా...వెళ్ళటానికి మేకు అర్హత ఎక్కడ ఉంది? ఎర్రాప్రగడ, శ్రీ శ్రీ, జాషువా లు మీకు ఏమి అన్యాయం చేశారు రా?
వీరు, మీకు కావాల్సిన పదవులు ఇవ్వలేదా? తెలంగాణ ఇవ్వనన్నారా వీళ్ళు? అభాగ్యుల మీద అత్యాచారం చేసిన "దొరలా", "రజాకార్లా", భారతీయుల ఆత్మ గౌరవాన్ని సవాల్ చేసిన "తెల్లవాళ్ళా?". వీళ్ళకి.. "నేటి తెలంగాణ సమస్య"కి సంబంధం ఏంటిరా?
జాతి కోసం పుట్టి, పోరాడిన వారు కొందరైతే, భాష సంస్కారం కోసం, మానసిక చైతన్యం కోసం కొందరు, బడుగు బలహీన వర్గాల గొంతైంది మరికొందరు. జాతి గౌరవాన్ని ఇనుమడింప చేయడానికి పుట్టిన మహా మనుషులను గుర్తుంచుకొని వారి అడుగు జాడలలో నడవాల్సింది పోయి.. ఈరోజు జరిగిన విగ్రహ ధ్వంసా కార్యక్రమం నీచమైనదనాలా..దారుణమైనదనాలా..లేక చివరికి.. అందరిలాగానే ప్రభుత్వ వైఫల్యమనాలా? ఛా! అసహ్యం వేస్తుందిరా! మిమ్మల్ని ఏమీ చెయ్యలేనందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది.ప్రస్తుతానికి నాకు కేవలం ఓటు హక్కు మాత్రమే ఉంది. కొన్నాళ్ళకి అడిగిన వాడికి ఓటు వెయ్యకపోతే కొడతారేమో..ఇదీ ప్రజాస్వామ్యం.
అసలే విగ్రహాలు పగలకొట్టారు అని బాధపడుతుంటే, ఒక వార్తా ఛానెల్ "ఇది సమంజసమా అని ఓటింగ్ పెట్టింది". విచిత్రంగా, మంచోళ్ళు కన్నా పిచ్చొళ్ళే ఎక్కువగ ఉన్నారు అని వోతింగ్ లో తేలింది. ప్రజలారా, మన జాతి నాశనం సమంజసమా?
This blog is about andhra pradesh politics. people requested to post their views(through comments) about present trend of politics. ప్రజలకి, ప్రభుత్వానికి వారధిగ ఉండాల్సిన పత్రికలు ఎదో ఒక పార్టీ కి మద్దతు ఇస్తూ రాస్తే ఇక ప్రజల బాధలు పట్టించుకొనేది ఎవరు? ఈ కుల్లు రాజకీయల కంపు నేను భరించలేక..ఎవరితొ చెప్పాలో తెలియక..నా బాధని ఇక్కడ పంచుకుంటున్నాను.
Thursday, March 10, 2011
Thursday, January 6, 2011
తెలుగోడు
ఓ తెలుగోడా, పంటలు పండక ఏడ్చావు, పండినది అందక ఏడ్చావు.. కాయగూరలు కొనలేక ఎడ్చావు, ఇంటి అద్దె కట్టలేక ఏడ్చవు, ఉల్లి ధర పెరిగిందని ఏడ్చావు, ధాన్యం అమ్మలేక ఏడ్చావు, బియ్యం కొనలేక ఏడ్చావు, ఈ రాజకీయ నాయకుల ఆటలో పావుగా మారావు. కన్ను తెరచి భవిష్యత్తు చూడు. రాష్ట్రం ముక్కలైతే మిగిలేది పన్నులే. రాజకీయ నాయకులకి కొత్త పదవులే.అయినా ఈ ప్రజాస్వామ్య దేశం లొ నిన్నెవరు అడుగుతారు లే..దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకొంటారు..
ఓ విద్యార్థీ, ఏది నీ ఛదువు? దొంగలకు గొడుగు పడుతున్నావా? తెలిసే పడుతున్నావా? ఈ ఉచ్చులొ నీ జాతి మొత్తాన్ని ఉరి తీస్తున్నవా? కళ్ళు తెరచి చూడు.. అభివ్రుద్ధి కాంక్షించు..
ఓ విద్యార్థీ, ఏది నీ ఛదువు? దొంగలకు గొడుగు పడుతున్నావా? తెలిసే పడుతున్నావా? ఈ ఉచ్చులొ నీ జాతి మొత్తాన్ని ఉరి తీస్తున్నవా? కళ్ళు తెరచి చూడు.. అభివ్రుద్ధి కాంక్షించు..
Wednesday, October 13, 2010
మా తెలుగు తల్లికి..
మీకు తెలుసో తెలియదో.. ఇది మన రాష్ట్ర గీతం.. మన తెలుగు వారికి సొంతమైన, మన గొప్పతనాన్ని తర తరాలకు పంచాల్సిన.. మన "రాష్ట్ర గీతం"..
మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి..
అని.. బాస చేసిన మనం ఈరొజు అదే తెలుగుతల్లి గుండెని రెండు ముక్కలు చెయ్యడమే కాకుండా..ఆ తల్లి మా తల్లి కాదు మీ తల్లి అని ఒక వర్గం చేత అనిపించుకొని తీవ్ర ఆవేదన కు గురిచేస్తున్నాం.
"వచ్చిండన్న వచ్చాడన్న వరాల తెలుగు ఒకటేనన్న..."
మాండలికాలెన్నున్నా, యాసలెన్నున్నా తెలుగు భాషకి లిపి ఒకటే. తెలుగుతల్లి ఏ ఒక్కరి సొంతమో కాదు..తెలుగు భాష తెలిసిన వారందరి సొంతం.
భాషా, పుట్టిన గడ్డ మీద అభిమానం, దేశభక్తి, లేని.. అదేంటో తెలియని స్వార్ధ రాజకీయ నాయకులు ఇప్పటికైన కళ్ళుతెరిచి ప్రవర్తించండి.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ,
మా కన్నతల్లికి మంగళారతులు,
కడుపులో బంగారు కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి.
గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరాబిరాక్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయీ
మురిపాల ముత్యాలు దొరులుతాయి.
అమరావతినగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములొ తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి వుండేదాకా
రుద్రమ్మ భుజశక్తి మల్లమ్మ పతిభక్తి
తిమ్మరసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవులు రింగుమని మారుమ్రోగేదాక
నీపాటలే పాడుతాం ,నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లి ,జై తెలుగు తల్లి..
అని.. బాస చేసిన మనం ఈరొజు అదే తెలుగుతల్లి గుండెని రెండు ముక్కలు చెయ్యడమే కాకుండా..ఆ తల్లి మా తల్లి కాదు మీ తల్లి అని ఒక వర్గం చేత అనిపించుకొని తీవ్ర ఆవేదన కు గురిచేస్తున్నాం.
"వచ్చిండన్న వచ్చాడన్న వరాల తెలుగు ఒకటేనన్న..."
మాండలికాలెన్నున్నా, యాసలెన్నున్నా తెలుగు భాషకి లిపి ఒకటే. తెలుగుతల్లి ఏ ఒక్కరి సొంతమో కాదు..తెలుగు భాష తెలిసిన వారందరి సొంతం.
భాషా, పుట్టిన గడ్డ మీద అభిమానం, దేశభక్తి, లేని.. అదేంటో తెలియని స్వార్ధ రాజకీయ నాయకులు ఇప్పటికైన కళ్ళుతెరిచి ప్రవర్తించండి.
Wednesday, May 12, 2010
భూగర్భ 'జల' ఘోష
ఈ పోస్ట్ రాజకీయాలకి సంబంధించినది కాకపోయినా చాలా ముఖ్యమైన పోస్ట్ అని భావించి ఇక్కడ రాస్తున్నాను.
విషయం ఏంటంటే, ఆ మధ్య భూగర్భ జలాలు గురించి ఈనాడు లో ఒక ఆర్టికల్ వచ్చింది.ఎన్నో విషయాలని పట్టించుకోని జనం దీనిని కూడా పట్టిచుకొలేదు. కాని అందులోని విషయాలు నన్ను చాలా కలవర పరిచాయి.
పూర్వం లాగ వర్షం నీరు భూమిలోనికి ఇంకే అవకాశం లేకుండ సిమెంట్ రోడ్లతో కప్పేసుకుంటున్నాం, చెరువులను పూడ్చుకుంటున్నాం, ఇలా ఆలోచిస్తే ఎన్నో. ఇంటి ముందు ఒక "ఇంకుడు గుంత" ని పెట్టమంటే.. ఆ.. ఎవడూ పెట్టనిది నేనెందుకు పెట్టాలి లే అనుకుంటున్నాం. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకొలేకపోతున్నాం. అనేక కారణాల వలన ఇప్పటికే వాతవరణం లొ పెనుమార్పులు సంభవించాయి, ఇది ఇలాగే సాగితే అతి కొద్ది కాలం లొ మనకి పెను ముప్పు పొంచి ఉంది.
కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని మన భూగర్భ జలాలను కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతీ ఇంటిముందు ఒక "ఇంకుడు గుంత" ని కట్టాలి, లేదా ఇంటి పన్ను రెండింతలు కట్టమని, కొత్త ఇళ్ళ ఆమోదనికి ప్లాను లో "ఇంకుడు గుంత" ని విధి గ పెట్టాలి, లేదా ప్లాను ఆమోదం పొందదని జీవో తేవాలి.
ఏప్పుడూ కుర్చీల (పదవుల) గురించె కాక, ఇలాంటి ముఖ్యమయిన విషయాల గురించి కూడా పట్టించుకోవాలని ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను.
విషయం ఏంటంటే, ఆ మధ్య భూగర్భ జలాలు గురించి ఈనాడు లో ఒక ఆర్టికల్ వచ్చింది.ఎన్నో విషయాలని పట్టించుకోని జనం దీనిని కూడా పట్టిచుకొలేదు. కాని అందులోని విషయాలు నన్ను చాలా కలవర పరిచాయి.
పూర్వం లాగ వర్షం నీరు భూమిలోనికి ఇంకే అవకాశం లేకుండ సిమెంట్ రోడ్లతో కప్పేసుకుంటున్నాం, చెరువులను పూడ్చుకుంటున్నాం, ఇలా ఆలోచిస్తే ఎన్నో. ఇంటి ముందు ఒక "ఇంకుడు గుంత" ని పెట్టమంటే.. ఆ.. ఎవడూ పెట్టనిది నేనెందుకు పెట్టాలి లే అనుకుంటున్నాం. దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించుకొలేకపోతున్నాం. అనేక కారణాల వలన ఇప్పటికే వాతవరణం లొ పెనుమార్పులు సంభవించాయి, ఇది ఇలాగే సాగితే అతి కొద్ది కాలం లొ మనకి పెను ముప్పు పొంచి ఉంది.
కాబట్టి ప్రభుత్వమే చొరవ తీసుకొని మన భూగర్భ జలాలను కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రతీ ఇంటిముందు ఒక "ఇంకుడు గుంత" ని కట్టాలి, లేదా ఇంటి పన్ను రెండింతలు కట్టమని, కొత్త ఇళ్ళ ఆమోదనికి ప్లాను లో "ఇంకుడు గుంత" ని విధి గ పెట్టాలి, లేదా ప్లాను ఆమోదం పొందదని జీవో తేవాలి.
ఏప్పుడూ కుర్చీల (పదవుల) గురించె కాక, ఇలాంటి ముఖ్యమయిన విషయాల గురించి కూడా పట్టించుకోవాలని ప్రభుత్వానికి మనవి చేసుకుంటున్నాను.
Tuesday, February 9, 2010
ఇలా ఆలొచిస్తే వింతగా ఉంది కదూ!
ప్రస్తుత రాజకీయలను చూస్తే నాకొక ఆలోచన వస్తుంది. అసలు "రాజకీయ పార్టీ" అనే ఒక కాన్సెప్టే లేదంటే, అందరూ ఇండిపెండెంట్ అభ్యర్థులైతే అప్పుడు రాజకీయాలు బాగుపడతాయేమో?
ఒక మనిషి తప్పు చేస్తే, పార్టీ పేరుతో ఎవరూ వెనకేసుకురానక్కరలేదు.
ఒక నిర్ణయం తీసుకోవలంటే, పార్టీ అధిస్టానం లాంటి వారి నిర్ణయం కోసం ఆగనక్కరలేదు. సింపుల్ వోటింగ్ సరిపోతుంది.
వోటు వేసే వోటరు పార్టీ కి గుడ్డి గ వెయ్యడు. మనిషికి వేస్తాడు.
అధికార పార్టి అనేదే లేకపొతే, అధికార పార్టి నాయకులు (వీళ్ళకి పదవులుండవు, కాని అధికార పార్టి పేరు చెప్పుకొని బ్రతుకుతారు. వీళ్ళని అంటిపెట్టుకొని మరికొన్ని పరాన్న జీవులు..ఇలా) ఉండరు.
ఎవడికి సమర్ధత ఉంటే వాడు నిధులు సంపాదిస్తాడు..వాడి ఏరియా డెవెలప్ చేసుకుంటాడు. చెయ్యకపోతే ప్రజలు వాడికి మళ్ళీ వోట్లు వెయ్యరు.
ఇలా ఆలొచిస్తే వింతగా ఉంది కదూ!
ఒక మనిషి తప్పు చేస్తే, పార్టీ పేరుతో ఎవరూ వెనకేసుకురానక్కరలేదు.
ఒక నిర్ణయం తీసుకోవలంటే, పార్టీ అధిస్టానం లాంటి వారి నిర్ణయం కోసం ఆగనక్కరలేదు. సింపుల్ వోటింగ్ సరిపోతుంది.
వోటు వేసే వోటరు పార్టీ కి గుడ్డి గ వెయ్యడు. మనిషికి వేస్తాడు.
అధికార పార్టి అనేదే లేకపొతే, అధికార పార్టి నాయకులు (వీళ్ళకి పదవులుండవు, కాని అధికార పార్టి పేరు చెప్పుకొని బ్రతుకుతారు. వీళ్ళని అంటిపెట్టుకొని మరికొన్ని పరాన్న జీవులు..ఇలా) ఉండరు.
ఎవడికి సమర్ధత ఉంటే వాడు నిధులు సంపాదిస్తాడు..వాడి ఏరియా డెవెలప్ చేసుకుంటాడు. చెయ్యకపోతే ప్రజలు వాడికి మళ్ళీ వోట్లు వెయ్యరు.
ఇలా ఆలొచిస్తే వింతగా ఉంది కదూ!
వినియోగదరుడే సమ్మె చేస్తే
ఎప్పుడూ ధరలు పెంచమని మద్యవర్తి వ్యాపరులు బంధ్ చేస్తారు...దానికి ఎప్పుడూ బలయ్యేది సామాన్య ప్రజలే కదా..పెట్రోల్ పెరిగినా, లారీ సమ్మె అయిన...వంట గ్యాస్ పెంచినా...అన్నీ..పరోక్షంగా..సామాన్య వ్యక్తి నడ్డి విరిచెవే కదా? అలాంటిది ఒకసారి వినియోగదారుడే సమ్మె చెస్తే?
ఈ మధ్యనే మాంసం వ్యాపారుల సమ్మె కి ప్రభుత్వం దిగి వచ్చి ధరలు పెంచేసింది.. ఇప్పుడు వినియోగదారులమైన మనం మాంసం తినటం ఒక నెల మానేస్తే?
గునపాఠం నెర్పినత్లు ఔతుంది కదా?
మీరేమంటారు?
ఈ మధ్యనే మాంసం వ్యాపారుల సమ్మె కి ప్రభుత్వం దిగి వచ్చి ధరలు పెంచేసింది.. ఇప్పుడు వినియోగదారులమైన మనం మాంసం తినటం ఒక నెల మానేస్తే?
గునపాఠం నెర్పినత్లు ఔతుంది కదా?
మీరేమంటారు?
Monday, December 28, 2009
రాజ్యాంగం అంటె రాజకీయం కాదు.
ఎన్నికలు అయిపొయాయి.ప్రజలు తమ ఇష్టం వచ్చిన వాల్లకి వోట్లు వేసి గెలిపించారు.మళ్ళీ ఏ పార్టీ కీ మంచి మెజారిటీ రాలేదు. అంకెల గారడి తో, ఆటలో అరటిపండు లా కాంగ్రెస్ మళ్ళీ గద్దెనెక్కింది. సరె, రాజశేఖరుడు ఉన్నాడు లే అని అనుకునే వాళ్ళకి ఆయన పెద్ద షాకే ఇచ్చాడు (చనిపోయి). కొంతమంది "రాజకీయ" నాయకులకి ఇది శుభవార్తే అయ్యింది. ఆయన సానుభూతి వోట్లతొ "కుమారుడిని" గద్దెనెక్కింద్దామనుకున్నవాళ్ళ పాచిక పారలేదు.తరువాత ఎవరికి పగ్గాలు అప్పజెప్పలా అని అనుకున్న అధిస్టానానికి మిగిలిన ఒకే ఒక ఛాయిస్ రొశయ్య. పాపం ఈయన గ్రహ చారమో లేక రాష్ట్ర గ్రహచారమో కాని, మూడు కరువులు ఆరు వరదలు, ఒక తెలంగాణ సమస్యతొ ప్రజలు పండగ చేసుకుంటున్నారు.
ఇక్కడివరకు ఒక యెత్తు అయితే ఇక్కడినుండి అసలు కథ మొదలయ్యింది. కొన్ని నాటకీయ పరిస్తితుల్లో కేంద్రం చేసిన ప్రకటన (స్పస్టం గానే ఉన్నప్పటికీ) కొంతమంది ప్రజలకి/నాయకులకి అర్థం కాలేదు (ఇంగ్లిష్ లో చెప్పారు కదా). అర్థం అయిన నాయకులు..కేంద్రం చెప్పిన దానికన్నా, ప్రజలు చెప్పిన కొత్త అర్థమే బాగుంది అనుకున్నరో ఎమో కాని, "ఫ్రోసెస్ ఆఫ్ తెలంగాణ" ని "తెలంగాణ అవతరణ" గా మార్చేశారు. అసలైన అర్థం చెప్పాల్సిన మీడియా.. ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని హైలైట్ చేస్తూ ప్రజలని తప్పు దారి పట్టిస్తుంది. ఇప్పుడు సుమారు 10 నిరంతర వక్రభాష్యాస్రవంతులున్నాయి మన రాష్ట్రం లో. వీళ్ళపని.. ఎవరు వక్ర భాష్యాలు చెప్తారో వారిని హైలైట్ చెయ్యటం. ఈ నేపధ్యం లొ అంధ్ర ప్రజల "సమైఖ్యాంధ్ర ఉద్యమం" ఊపందుకుంది. కేంద్రానికి "వదలమంటే పాముకి కోపం.. వదలొద్దంటే కప్పకి కోపం" చందాన ఏమి చెప్పాలో అర్థం కాలేదు. కేంద్రం ఏమి మాట్లడకపోవడంతొ ఎవరిస్టానుసరం వారు ప్రవర్తిస్తూ ఉన్నారు మన నాయకులు, నయ(వంచ)కులు.
నిన్న ఒక నాయకుదు.."చిరంజీవి ని లగడపాటిని ఉస్మానియా కి వచ్చి సమైఖ్యాంధ్ర అనమనండి, తెలంగాణ ప్రజలు తోలు తీస్తరు" అన్నారు. అంటే (తెలంగాణ) ప్రజలకి పరోక్షం గా "మనకు వ్యతిరేకం గా ఎవరు మాట్లాడినా తోలు తీయమని చెప్తున్నారా?". సగటు మనిషి అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చునని, దానిని ప్రజస్వామ్యం లొ 'వాక్ స్వాతంత్రయం' అంటారని ఈయనకి తెలీదా? తెలిసి, రెచ్చగొట్టే వ్యాఖ్యలని చెయ్యకూడదని కూడా తెలీదా. సందట్లొ సడెమియా అని యెన్.డి.తివారి ఏదొ వేరె స్కాం లో దొరికిపొతె..దానిని ఖండించకుండా.. రాజీనామా చేసేసి, ఇప్పుడు దానిని తెలంగాణ ఇష్యూ తొ కలుపుతున్నాడు. 85 యేళ్ళు వచ్చినా రాజకీయాలు మానలేదు ఈయన.
ఓ నా ప్రజలార...తెలంగాణ కావాలంటే ప్రజాస్వామ్య బధ్ధం గ పోరాడండి, సాధించుకోండి. తొటి పౌరుడి హక్కులను కాపాడండి, మీ బాధ్యత తెలుసుకోండి. కాని ఈ ముదనస్టపు రాజకీయ నాయకుల మాటలకు బలి కావద్దు.
నాయకులారా: రాజ్యాంగం అని ఒక పుస్తకం ఉంటుంది. ఇందులొ రాజకీయం గురించి ఉండదు...రాజ్య పరిపాలనా నిబంధనలు ఉంటాయి..కొని చదవండి. అర్థం కాకపొతే అడగండి. వచ్చీ రాని విద్యతో ప్రజల జీవితాలతో ఆడుకొవద్దు.
రాజ్యాంగం అంటె రాజకీయం కాదు.
ఇక్కడివరకు ఒక యెత్తు అయితే ఇక్కడినుండి అసలు కథ మొదలయ్యింది. కొన్ని నాటకీయ పరిస్తితుల్లో కేంద్రం చేసిన ప్రకటన (స్పస్టం గానే ఉన్నప్పటికీ) కొంతమంది ప్రజలకి/నాయకులకి అర్థం కాలేదు (ఇంగ్లిష్ లో చెప్పారు కదా). అర్థం అయిన నాయకులు..కేంద్రం చెప్పిన దానికన్నా, ప్రజలు చెప్పిన కొత్త అర్థమే బాగుంది అనుకున్నరో ఎమో కాని, "ఫ్రోసెస్ ఆఫ్ తెలంగాణ" ని "తెలంగాణ అవతరణ" గా మార్చేశారు. అసలైన అర్థం చెప్పాల్సిన మీడియా.. ఎవరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే వాళ్ళని హైలైట్ చేస్తూ ప్రజలని తప్పు దారి పట్టిస్తుంది. ఇప్పుడు సుమారు 10 నిరంతర వక్రభాష్యాస్రవంతులున్నాయి మన రాష్ట్రం లో. వీళ్ళపని.. ఎవరు వక్ర భాష్యాలు చెప్తారో వారిని హైలైట్ చెయ్యటం. ఈ నేపధ్యం లొ అంధ్ర ప్రజల "సమైఖ్యాంధ్ర ఉద్యమం" ఊపందుకుంది. కేంద్రానికి "వదలమంటే పాముకి కోపం.. వదలొద్దంటే కప్పకి కోపం" చందాన ఏమి చెప్పాలో అర్థం కాలేదు. కేంద్రం ఏమి మాట్లడకపోవడంతొ ఎవరిస్టానుసరం వారు ప్రవర్తిస్తూ ఉన్నారు మన నాయకులు, నయ(వంచ)కులు.
నిన్న ఒక నాయకుదు.."చిరంజీవి ని లగడపాటిని ఉస్మానియా కి వచ్చి సమైఖ్యాంధ్ర అనమనండి, తెలంగాణ ప్రజలు తోలు తీస్తరు" అన్నారు. అంటే (తెలంగాణ) ప్రజలకి పరోక్షం గా "మనకు వ్యతిరేకం గా ఎవరు మాట్లాడినా తోలు తీయమని చెప్తున్నారా?". సగటు మనిషి అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చునని, దానిని ప్రజస్వామ్యం లొ 'వాక్ స్వాతంత్రయం' అంటారని ఈయనకి తెలీదా? తెలిసి, రెచ్చగొట్టే వ్యాఖ్యలని చెయ్యకూడదని కూడా తెలీదా. సందట్లొ సడెమియా అని యెన్.డి.తివారి ఏదొ వేరె స్కాం లో దొరికిపొతె..దానిని ఖండించకుండా.. రాజీనామా చేసేసి, ఇప్పుడు దానిని తెలంగాణ ఇష్యూ తొ కలుపుతున్నాడు. 85 యేళ్ళు వచ్చినా రాజకీయాలు మానలేదు ఈయన.
ఓ నా ప్రజలార...తెలంగాణ కావాలంటే ప్రజాస్వామ్య బధ్ధం గ పోరాడండి, సాధించుకోండి. తొటి పౌరుడి హక్కులను కాపాడండి, మీ బాధ్యత తెలుసుకోండి. కాని ఈ ముదనస్టపు రాజకీయ నాయకుల మాటలకు బలి కావద్దు.
నాయకులారా: రాజ్యాంగం అని ఒక పుస్తకం ఉంటుంది. ఇందులొ రాజకీయం గురించి ఉండదు...రాజ్య పరిపాలనా నిబంధనలు ఉంటాయి..కొని చదవండి. అర్థం కాకపొతే అడగండి. వచ్చీ రాని విద్యతో ప్రజల జీవితాలతో ఆడుకొవద్దు.
రాజ్యాంగం అంటె రాజకీయం కాదు.
Subscribe to:
Posts (Atom)