Saturday, March 23, 2019

ఎన్నికలు..సోషల్ మీడియా ప్రచారం

వెన్నుపోటు, కేసులు, బి పార్టి లాంటి చౌకబారు ప్రచారాలని మర్చిపోయి ఒకసారి తటస్తంగా ఆలోచించడానికి ప్రయత్నిద్దాం..సేంద్రీయ వ్యవసాయం, రైతు పంటకి సరైన మార్కెటింగ్, కోల్డ్ స్టొరేజిలు, మస్త్యకారులకి జెట్టిలు, మరబోటులు వగైరా, ఇవి కదా నిజమైన సహాయం. అంతేకాని, ప్రతినెల అందరికి డబ్బులు పంచడం వాళ్ళని బిచ్చగాళ్ళని, సోమరులని చెయ్యటమే ఔతుంది..మరి మనం కట్టే పన్నులు ఇలా వృధా అవ్వటం ఎన్నాళ్ళు భరించాలి? రేషన్ లో అవినీతికి తావివ్వటం కన్నా, డబ్బులు నేరుగా మహిళల ఖతాలలో వెయ్యటం మంచి ఆలోచన కాదంటరా? దీనివల్ల వ్యవస్థలో కూరుకుపోయిన అవినీతిని (ఆ విభాగం వరకు అయినా) సమూలంగ నిర్మూలన కాదా? వీటితో పాటు ప్రత్యేక రాస్ట్ర ప్యాకేజి, పారిశ్రామిక విధానం (చిత్తశుద్ధి ఎలాగూ ఉంది), మరి ఇలాంటి దీర్ఘకాలిక ప్రయోజనాలతో మార్పు తెస్తానన్న జనసేన బాగాలేదంటారా? ఆలోచించండి..ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజారిటి రాకపోవచ్చు, కాని మార్పుకి తొలిమెట్టైనా ఔతుంది.. సోషల్ మీడియాలో ప్రచారం విఙ్నానవంతంగా, ఆలోచించేదిగా ఉండాలి కాని..తిట్టుకుంటూ ఎన్నాళ్ళు చేస్తారు? దానివల్ల ఉపయోగం ఏంటి?